Read more!

English | Telugu

'కాశ్మీర్ ఫైల్స్' కాంబినేషన్ లో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్

చిన్న సినిమాగా విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ ఉత్సాహంతో ఇప్పుడీ సినిమా దర్శక నిర్మాతలు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు.

వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన 'కాశ్మీర్ ఫైల్స్'ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్‌ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా ప్రపంచ సినిమాని ఆకర్షించింది. 1990లో కాశ్మీరీ పండిట్‌లు ఎదురుకున్న నాటి పరిస్థితులని హృదయాన్ని కదిలించేలా తెరపై ఆవిష్కరించారు. నిజాయితీ చెప్పిన ఈ కథ కోట్లాది ప్రేక్షకులు మనసులను గెలుచుకుంది. ఇప్పుడు అంతే నిజాయితీతో వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరో రెండు నిజాయితీ గల కథలు వెండితెరపై చూపించాలని సంకల్పించారు.

250 కోట్ల క్లబ్‌లో చేరిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ ప్రదర్శింపబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ఈ చిత్రాన్ని అభినందించారు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ ప్రకటన విడుదలైంది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.