Read more!

English | Telugu

ఛత్రపతి శివాజీగా అక్షయ్ కుమార్!

 

అక్షయ్ కుమార్ ఎప్పుడూ విరామం అనేది లేకుందా వరుసగా సినిమాలు చేస్తుండే అరుదైన స్టార్. ఆయన ఎప్పుడూ డిఫరెంట్‌ జోనర్‌ల సినిమాలు చేయాలనే తపనతో ఉంటాడు. ఉదాహరణకు, ఈ సంవత్సరం ఆయన యాక్షన్ కామెడీ (బచ్చన్ పాండే), హిస్టారికల్ డ్రామా (సామ్రాట్ పృథ్వీరాజ్), ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ (రక్షా బంధన్), మర్డర్ మిస్టరీ (కట్‌పుట్లీ), యాక్షన్ అడ్వెంచర్ (రామ్ సేతు)లో కనిపించాడు. ఈ నటుడు ప్రస్తుతం చేస్తున్న, చేయబోతున్న సినిమాల లిస్టులో ఇప్పటికే అరడజనుకు పైగా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం, ఆయన మరో చిత్రం చేస్తున్నాడని, అందులో ఒక ఐకానిక్ క్యారెక్టర్ చేయబోతున్నాడని వెలుగులోకి వచ్చింది. 

బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో, మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేస్తున్న మాగ్నమ్ ఓపస్ 'వీర్ దౌడలే సాత్‌'లో "ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను అక్షయ్ కుమార్ తప్ప మరెవరూ పోషించరు" అని ప్రకటించారు. ఆసక్తికరమైన విషయమేమంటే, ఆహ్వానంలో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో భాగమని కానీ, ఈవెంట్‌కు హాజరవుతాడని కానీ తెలుపలేదు. అక్కడున్న జర్నలిస్టులను షాక్‌కి గురిచేసిన సూపర్‌స్టార్ ఒక్కసారిగా స్టేజి పైకి వచ్చాడు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే, మహేష్ మంజ్రేకర్ కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. 

'వీర్ దౌడలే సాత్' కేవలం మరాఠీలోనే కాకుండా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదల కానుంది. వసీమ్ ఖురేషి యొక్క ఖురేషి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వసీమ్ ఖురేషి నిర్మించే ఈ మూవీ 2023 దీపావళికి విడుదలవుతుంది.అంటే 'సూర్యవంశీ' (2021), 'రామ్ సేతు'  తర్వాత అక్షయ్ కుమార్‌కి ఇది వరుసగా మూడవ దీపావళి విడుదల అవుతుంది.