English | Telugu

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి కన్నుమూత

బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఇటీవల 'సిండ్రెల్లా' మూవీ షూటింగ్ కోసం లండన్‌ వెళ్ళిన అక్షయ్.. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే ముంబైకి తిరిగి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని హిరానందాని ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్షయ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "ఆమె నా బలం. ఆమె ఇక లేరనే విషయం తెలిసి భరించలేంత నొప్పిని అనుభవిస్తున్నాను. మా అమ్మ శ్రీమతి అరుణ భాటియా ఈరోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి.. పరలోకంలో ఉన్న మా నాన్నను కలవడానికి వెళ్లారు. నేను, నా కుటుంబం అత్యంత విషాదంలో ఉన్న సమయంలో మీరు మాకోసం చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి" అంటూ అక్షయ్‌ ట్వీట్‌ చేశారు.

కాగా అక్షయ్‌ తల్లి మరణించారన్న వార్త తెలియడంతో ప్రముఖులు సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్‌ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.