సర్కార్ సీజన్ 3 లో "న్యూసెన్స్" చేసిన టీం..
సర్కార్ సీజన్ 3 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "న్యూసెన్స్" మూవీ టీం ప్రొమోషన్స్ లో భాగంగా నవదీప్, బిందుమాధవి వచ్చారు. వాళ్ళతో పాటు టీవీ 9 న్యూస్ రీడర్స్ ప్రత్యూష, సత్య కూడా వచ్చారు. ఈమధ్య టీవీ చానెల్స్ నుంచి న్యూస్ రీడర్స్ కూడా షోస్ కి, ఈవెంట్స్ కి వచ్చే సంస్కృతి నెమ్మదిగా మొదలయ్యింది. వాళ్ళు కూడా ఆడియన్స్ కి బాగా తెలిసిన ముఖాలు కావడం వాళ్లకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండడంతో షో మేకర్స్ కూడా వాళ్ళను బాగా హైలైట్ చేస్తున్నారు.