మొన్న ప్రధాని మోడీ
అట్టహాసంగా ప్రారంభించి
జాతికి అంకితం చేసిన
భిన్నత్వంలో ఏకత్వానికి
సుస్థిర సుపరిపాలనకు
సనాతనధర్మాలకు
సంస్కృతి సాంప్రదాయాలకు
ప్రజల ఆశలకు ఆకాంక్షలకు
ప్రతి బింభమైన
ప్రజాస్వామ్య దేవాలయం
నూతన పార్లమెంట్ భవనం
త్రిభుజాకారంలో...
లోక్ సభ జాతీయ పక్షి
నెమలి ఆకృతిలో...
రాజ్యసభ జాతీయ పుష్పం
కమలం ఆకృతిలో...
3 శక్తి జ్ఞాన కర్మ ముఖద్వారాలతో...
4 అంతస్తుల్లో ...
16 ఎకరాల్లో ...
970 కోట్లఖర్చుతో...
1224 మంది పార్లమెంటు సభ్యులకోసం
అహమ్మదాబాద్ ప్రముఖ ఆర్కిటెక్
బిమల్ పటేల్ డిజైన్ చేయగా...
60000మంది కార్మికులచే
టాటా ప్రాజెక్టు లిమిటెడ్
2 సంవత్సరాల 5 నెలల 18 రోజుల్లో
నిర్మించిన చారిత్రాత్మకమైన కట్టడం
కానీ ఎంతో అంగరంగ వైభవంగా
జరిగుతున్న ఈ నూతన పార్లమెంట్
భవన ప్రారంభమహోత్సవానికి
"మాయని మచ్చ" ఒక్కటే....
ఈ ప్రజాస్వామ్య దేవాలయానికి
దేవతగా ఆరాధించబడే గౌరవించబడే
దళితమహిళా రాష్ట్రపతి శ్రీమతి ముర్మును
మొన్న బ్రిటిష్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి...
నేటి మన కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి...దూరంగా ఉంచడమే
నిరసనగా ప్రతిపక్షాలు బహిష్కరించడమే
ఇది అంబేద్కర్ అందించిన
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే...
ఇది అత్యున్నత పీఠానికి అవమానమే...
ఇంటిగుట్టు ఈశ్వరునికే ఎరుకన్నట్టు
అంతుచిక్కని ఈ చిదంబర రహస్యం
ఆ మోడికి...అమిత్ షాకి ఆపూజారులకు
ఆవేదపండితులకు ఆమనువాదులకే ఎరుక
ఔను ఈ సువిశాల సుందర పార్లమెంట్
భవనం భారతీయులకు ఓ గొప్పవరం
భారతమాత మెడలో మెరిసే పచ్చలహారం
ఇది భరతజాతి చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించదగిన శుభదినం మోడీ దార్శనికతకిది నిలువెత్తు నిదర్శనం
సాహసోపేత నిర్ణయాలకు సజీవ సాక్ష్యం.



