ఆరో అంతస్తులో… ఆరు ఫైళ్ళపై సంతకాలు..!
మొన్న ఆదివారం
వాస్తుశాస్త్ర నిపుణులు
"సుద్దాల సుధాకర్ తేజ"
ఆధ్వర్యంలో ఏర్పాటైన
"యజ్ఞశాల" శృంగేరిపీఠ
వేదపండితుల రుత్విక్కుల
మంత్రోచ్చారణలతో
మారుమ్రోగిపోగా...
భక్తితో చండీయాగం...
సుదర్శన యాగం...వాస్తు...లక్ష్మీ
పూర్ణాహుతి పూజలు చేసి హారతి గైకొని...
వేదపండితుల ఆశీర్వచనాలతో...
"ఆరో అంతస్తులోని" తన చాంబర్ లో
మిట్టమధ్యాహ్నం 1.29 ని. లకు
11 మంది వేదపండితులు
నిర్ణయించిన సుముహూర్త వేళ
"తెలంగాణ సింహంలా" తన
సింహాసనం పై సుఖాసీనులై
"ఆరు ఫైళ్ళపై" సంతకాలు చేసిన
"సి.యం కేసీఆర్"
పెట్టిన తొలిసంతకంతో
5544 మంది కాంట్రాక్టు
ఉద్యోగుల జీవితాలలో
"వెన్నెల వెలుగులు" విరజిమ్మాయి
జయహో ! జయహో !
సియం కేసీఆర్ కి జయహో !
జయహో ! జయహో !
తెలంగాణ తెలుగుతల్లికి జయహో !



