అయ్యో ఓ దైవమా..?
నిత్యం నీ సన్నిధిలో నిలబడి
నీ గుడిగంటలు మ్రోగించి...
మా చిరుకోర్కెలు తీర్చమని...
మా సమస్యలు పరిష్కరించమని...
ప్రశాంతమైన సుఖజీవనాన్ని మాకు
ప్రసాదించమని...ఘోర ప్రమాదాలనుండి
తప్పించమని...కన్నీటితో...ప్రార్ధించితిమే...
మరి మా విన్నపాలు...మా నివేదనలు
మా వ్రతాలు...నోచిన నోములు మేము
చేసిన పూజలు ప్రార్థనలు ఏమాయె...?
మూడు రైళ్ళలో మృత్యువు
మమ్ము కర్కశంగా కబలించివేసే...
చిమ్మ చీకటిలో చిరుతపులులు
జింకల గుంపును చీల్చి చెండాడినట్లు
మమ్ము ముక్కలుముక్కలు చేసి విసిరేసె...
మా కుటుంబాలలో కసితో
ఆవిధి విషాన్ని విషాదాన్ని నింపే...
బంగారు బ్రతుకులెన్నో చిధ్రమైపోయె...
రైలుబోగీలలో ఇరుక్కొని నలిగిపోతిమి...
రైలు పట్టాలపై మారక్తం ఏరులై పారే...
మా శరీర భాగాలు చెల్లాచెదురై పోయె...
ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా...మా
మృతదేహాలే...హాహాకారాలే ఆర్తనాదాలే...
అయ్యో ! అయ్యో ఓ దైవమా !
ఎక్కడ దాగి ఉన్నావయ్యా !!
ఏమి చేస్తున్నావయ్యా..?ఎందరినో బలిగొన్న ఈ బాలాసోర్ రైలు ప్రమాదానికి...
బాధ్యులెవరయ్యా ఈ మారణహోమానికి?
ఇది ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వైఫల్యమా..?
ఇది విధి లిఖితమా?...మానవ తప్పిదమా?
ఇందరి జీవితాలను బలిగొన్న
ఆ దుష్టులకు...ఆ దుర్మార్గులకు
ఆ రాబందులకు...ఆ రక్తపిశాచులకు
నీవే కఠినమైన శిక్షను విధించి మా
న్యాయదేవత కళ్ళు తెరిపించండి తండ్రీ!
మృతుల ఆత్మలకు శాంతి కలుగునుగాక!
చిధ్రమైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యము
అందునుగాక ! త్వరగా కోలుకొందురు గాక



