Facebook Twitter
వందేమాతర గీతం…

ఏ పాట వింటే...
భారతీయులందరి
ఒళ్ళు పులకరిస్తుందో...

ఏ పాట వింటే...
తెల్లదొరల గుండెల్లో
మరఫిరంగులు పేల్తాయో...

ఏ పాట వింటే...
ప్రజలు ఒక ప్రభంజనమై
ఒక ఉప్పెనై విరుచుకుపడతారో...

ఏ పాట వింటే...
పశువులు శిశువులు
సైతం ఉలిక్కిపడి లేస్తాయో...

ఏ పాట వింటే...
అణువణువునా
తరతరాలుగా నరనరాలలో
స్వాతంత్ర్య కాంక్ష
దేశభక్తి రగులుతుందో...

ఏ పాట వింటే...
మన స్వాతంత్ర్య
సమరయోధులంతా
పిడికిళ్లు బిగించి సింహాలై
స్వరాజ్య సమరానికి సిద్దమౌతారో...

ఏ మంత్రదండంతోనైతే...
మన విప్లవవీరులు...
భగత్ సింగ్
ఝాన్సీలక్ష్మీబాయి
అల్లూరి సీతారామరాజు
పరమక్రూరులైన
ఆ తెల్లదొరలను ఎదిరించారో...
వారి గుండెల్లో నిదురించారో...
అదేఅదే మన జాతి పదేపదే
పాడుకునే "వందేమాతర గీతం"