ఓ నా ప్రియ మిత్రులారా...!
మీ అందరికిదే నా "సద్భావన సందేశం"
కులం ఒక గజ్జి కుక్కైతే...తిరగనివ్వకు
మతం ఒక పిచ్చిమొక్కైతే...పెరగనివ్వకు
నిన్న మతం ఒక మత్తుమందు
నేడు ఆ పేరు ఎత్తితేనే రక్తం చిందు
ఎవరు ముస్లిం...?ఎవరు హిందువు...?
ఎవరు క్రిష్టియన్...?ఎవరు సిక్కు...?
ఈ నేలపై స్వేచ్ఛగా జీవించడం
కాదా ప్రతి ఒక్కరి జన్మ హక్కు...
రాముడు కోరునా..? రక్తాభిషేకం...లేదే
అల్లా కోరునా..? అల్లకల్లోలం...లేదే
క్రీస్తు కోరునా..? కిరాతకం...లేదే
మీరెందుకు...?
కులంపేర ఈ కుమ్ములాటలు...
మతంపేర ఈ మారణహోమాలు...
మనమంతా కన్నతల్లి
భారతమాత...ముద్దుబిడ్డలం
మనందరిలో ప్రవహించాలి
భిన్నత్వంలో ఏకత్వం...
నేడు మనందరి నినాదం ఒక్కటే...
సమైక్యతే...సర్వమతాల ఐక్యతే...
మానవత్వమే...మతసామరస్యమే...
హిందూ ముస్లిం భాయి భాయి...
కలుపుదాం అందరం చేయి చేయి....
ఆ మధుర భావనే ఎంత హాయి...
ఎంత హాయి...
సద్భావన...సమానత్వం...
సౌభ్రాతృత్వమే
మన ఊపిరైతే...అవనిపై
నా భరతభూమి స్వర్గసీమేనోయ్...
మేరా భారత్ మహాన్...
మేరా భారత్ మహాన్...
జైహింద్...జై భారత్...



