Facebook Twitter
ఆగస్టు 15 - అర్థరాత్రి స్వాతంత్ర్యం?

ఆనాడు‌
అల్లూరి సీతారామరాజు
భగత్ సింగ్ ఝాన్సీలక్ష్మీబాయిలాంటి
విప్లవ వీరులెందరో...
తెల్లదొరల మరఫిరంగులకు నేలకొరిగితేనే...

గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్
సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి
జాతినేతలెందరో....
లాఠీదెబ్బలు తింటేనే...జైళ్ళల్లో మ్రగ్గితేనే...

స్వాతంత్ర్య కాంక్షతో రగిలిపోయే
స్వాతంత్ర్య సమరయోధులెందరో...
జాతిపిత పిలుపుతో జనసంద్రమై
పిడికిళ్లు బిగించి "క్విట్ ఇండియా"
అంటూ "సమర శంఖాన్ని" పూరిస్తేనే...

"వందేమాతరం" అంటూ
దిక్కులు పిక్కటిల్లేల నినదిస్తేనే...

దేశభక్తులెందరో
ఉద్యమకెరటాలై
అహింసామార్గంలోె
ఉవ్వెత్తున ఎగసిపడితేనే...

విప్లవ సింహాలై
అలుపెరుగక పోరాటం చేస్తేనే...
తమ ప్రాణాలను ఫణంగా పెడితేనే...
జులియన్ వాలాబాగ్ లో రక్తతర్పణచేస్తేనే...
వచ్చింది...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం ...

ఈ భారతజాతికి
అంబేద్కర్ అందించిన
-  రక్షణ కవచమే రాజ్యాంగం
పంచిన అమృత ఫలాలే...
- పౌర హక్కులు
- స్వేచ్ఛా - స్వాతంత్ర్యం
- సమానత్వం - సౌభ్రాతృత్వం
ప్రసాదించిన అద్భుత వరాలే...
- భిన్నత్వంలో ఏకత్వం
- రామరాజ్యం - ప్రజాస్వామ్యం