మత్తయి సువార్త...
5వ అధ్యాయం...
28వ వచనం...
ఒక స్త్రీని మోహపు చూపుతో
చూచు ప్రతివాడు అప్పుడే
తన హృదయమందు ఆమెతో
"వ్యభిచారం" చేసినవాడగును...
అంటూ చేసిన బైబిల్ "దివ్య ప్రబోధం"....
గుర్తుంచుకోవాలి
భార్యాభర్తలిద్దరూ "బ్రతికినంతకాలం"....
ఆరీతిగా...
ఒక పరపురుషున్ని
ఆనందపరచాలని...
ఆకర్షించాలని...చెడుభావనతో
కొత్త పెళ్ళికూతురులా...
అందంగా అలంకరించుకొని...
మదిలో దూరిన చెడు ఆలోచనలతో...
తలలో దూరిన తప్పుడు తలంపులతో...
వక్రబుద్ధితో చాటుమాటుగా
దొంగ చూపులు చూచు ప్రతిఆడది
అప్పుడే తన హృదయమునందు ఆమె
ప్రాణానికి ప్రాణమైన తన భర్తను తానే
అతి దారుణంగా"దగా"...చేసినదగును...
అప్పుడే తన "భర్త గౌరవానికి"
తానే "మాయని మచ్చ"తెచ్చినదగును...
అప్పుడే తన పచ్చని కాపురంలో
తానే "ఆరని చిచ్చు" పెట్టుకొన్నదగును...
అంటూ "విడాకుల విషం" పుచ్చుకున్న
"విధివంచితులు" విలపిస్తూ
ఆలపించిన.....ఆ "విషాదగీతం"...
గుర్తుంచుకోవాలి
భార్యాభర్తలిద్దరూ "జీవితాంతం"...



