జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న కర్నూలులో జరిగిన యువభేరిలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పాల్మాకుల వద్ద జగన్ కారు టైరు ఒక్కసారిగా పంక్ఛర్ అయ్యింది. దీంతో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కు వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపుచేశాడు. వెంటనే కాన్వాయ్‌లోని సిబ్బంది జగన్‌‌కు రక్షణగా నిలిచారు. అనంతరం టైరు మార్చుకుని అదే కారులో జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారు.