రాజశ్యామల యాగం పూర్ణాహుతికి హాజరైన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి.. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న సీఎం జగన్.. అనంతరం గోమాతకు నైవేద్యం సమర్పించి.. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారు. అదేవిధంగా పీఠంలో కొత్తగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 

ఆ తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి సీఎం జగన్ పాల్గొన్నారు. లోక కల్యాణార్థం విశాఖ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతికి సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు ప్రశాంతిరెడ్డి, నాదెళ్ల సుబ్బారావు, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu