అవిశ్వాస తీర్మానం నోటీసులు పెట్టిన వైసీపీ..టీడీపీ మద్దతు.

 

మోదీ ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభ జనరల్ సెక్రటరీని కలసి నోటీసులను అందజేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని... ఆ తర్వాత హామీని విస్మరించిందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తమ అవిశ్వాస తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఇదిలా ఉండగా వైసీపీ తీర్మానానికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మద్దతివ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇద్దామని పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేశారు.