జగన్ కి దెబ్బ మీద దెబ్బ... టీడీపీ కండువా కప్పుకున్న గొట్టిపాటి

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఒకే రోజు ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి పార్టీకి రాజీనామా చేయగా.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిశంకర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వచ్చిన గొట్టిపాటికి విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి గొట్టిపాటిని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. గొట్టిపాటి వెంట వచ్చిన వైసీపీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీ కండువాలు కప్పారు. కర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వచ్చిన గొట్టిపాటికి విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి గొట్టిపాటిని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. గొట్టిపాటి వెంట వచ్చిన వైసీపీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీ కండువాలు కప్పారు.