వ్యాపంపై సీబీఐ విచారణకు ఓకె!

 

మధ్యప్రదేశ్ లో గత 15 సం.లుగా వ్యాపం కుంభకోణంలో అనేకమంది అరెస్టులు, అనుమానస్పద మరణాలు సాగుతున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దానిపై సీబీఐ విచారణకు నిరాకరిస్తూ వచ్చింది. కానీ నానాటికీ ఈ అనుమానస్పద మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో సుప్రీంకోర్టు దీనిపై రేపు విచారణ చేప్పట్టబోతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో సహా ఉత్తరాదిన అనేక ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఎట్టకేలకు ఆయన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాసారు. ఒకవేళ ఆయన వ్రాసి ఉండక పోతే రేపు సుప్రీంకోర్టే స్వయంగా కేంద్రాన్ని ఆదేశించేదేమో?