మత్తయ్య కాల్ డేటా ఇవ్వాలన్నా కోర్టు

ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరసలేం మత్తయ్య కాల్ డేటా కావాలని సీఐడీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ పిటీషన్ ను కోర్టు అనుమతించింది. మత్తయ్యకు సంబంధించిన కాల్ డేటాను సీఐడీ కి ఇవ్వాల్సిందిగా ఎయిర్‌టెల్‌, ఐడియా, రిలయన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు సమన్లు జారీ చేసింది. మే 1వ తేదీ నుండి జూన్ 20 వ తేదీ వరకు మత్తయ్య, అతని భార్య, సోదరుడు, అతని స్నేహితులకు సంబంధించిన కాల్ డేటాను ఇవ్వాలని.. అది కూడా జులై 1 వ తేదీ లోపు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.