కోహ్లీ వైజాగ్ టూర్ పై సీఎం చంద్రబాబు రియాక్షన్

 

భారత్‌, వెస్టిండీస్‌ ల మద్య ఐదు వన్డేల సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.సిరీస్‌ లో  రెండో వన్డే విశాఖ వేదికగా జరగనుంది.ఈ నేపథ్యంలో ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి.ఓ హోటల్ లో బస ఏర్పాటు చేయగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హోటల్‌ నుంచి సముద్రం కనబడేలా ఫోటో తీసుకుని దాన్ని ట్వీట్‌ చేస్తూ.. అద్భుతమైన ప్రదేశం. ప్రియమైన విశాఖకు వచ్చాను’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు.విశాఖ నగరంపై విరాట్‌ కోహ్లి చేసిన ట్వీట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.కోహ్లి ట్వీట్‌కు రిప్లైగా  "విశాఖ.. దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుంది. విశాఖ వన్డే సందర్భంగా కోహ్లి సేనకు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్‌ చేశారు.