చంద్రబాబుపై తిరుగుబాటు.. 23 తరువాత టీడీపీ ముక్కలు

 

వైసీపీ నేత విజయ సాయి రెడ్డికి కనీసం రోజుకి ఐదారు సార్లైనా చంద్రబాబుని విమర్శిస్తూ ట్వీట్ చేయకపోతే నిద్రపట్టదనుకుంటా. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. ఈ నెల 23 తరువాత టీడీపీ పార్టీ నే ముక్కలవుతుంది అని ట్వీట్ చేశారు. "23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు  చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం." అని విజయ సాయి రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.