ఉదయభాను కొప్పులో కమలమా

 

ప్రముఖ టీవీ యాంకర్, సినీనటి ఉదయభాను త్వరలో బీజేపీలో చేరబోతోందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు ముహూర్తం కూడా మీడియానే ఖరారు చేసేసింది. వచ్చేనెల 11న హైదరాబాద్ లో జరుగనున్న నరేంద్ర మోడీ సమావేశంలో ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకొంటారని, ఆమెకు పార్టీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని, అదేవిధంగా తెరాస కూడా ఆమెకు అటువంటి ఆఫర్లతోనే గేలం వేస్తోందని అంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, అవి తన ఒంటికి పడవని ఆమె చెప్పారు. తనకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన టీవీ, సినిమా రంగాలని విడిచి రాజకీయాలలో చేరే ఉద్దేశ్యం లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆమె రాజకీయ ఆరంగ్రేటంపై వార్తలు మాత్రం ఆగలేదు.