తెలంగాణలో టైమ్స్‌‌ నౌ ఎగ్జిట్‌ పోల్ సర్వే

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు సర్వేలు వచ్చాయి. గత ఎన్నికల్లో కూడా కొన్ని సంస్థలు వెల్లడించిన సర్వేలు ఇంచుమించు నిజమవ్వగా.. మరికొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలు అట్టర్‌ప్లాప్ అయ్యాయి. తాజాగా టైమ్స్ నౌ సంస్థ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు ప్రకటించింది.

టైమ్స్‌‌ నౌ ఎగ్జిట్‌ పోల్ సర్వే ప్రకారం

తెలంగాణలో మొత్తం స్థానాలు 119
టీఆర్‌ఎస్‌- 66
ప్రజాకూటమి- 37
బీజేపీ- 7 
ఇతరులు-9 
 సీట్లు వస్తాయని టైమ్స్‌‌ నౌ ప్రకటించింది. అయితే ఇది ఎంత వరకు నిజమవుతుందా..? అనేది డిసెంబర్ 11న తేలిపోనుంది. ఇదిలా ఉంటే జాతీయ వార్తా చానెళ్లు ఎన్డీటీవీ, ఏబీపీ, హెడ్‌లైన్ టుడే, సీఎన్ఎన్ ఐబీఎన్, న్యూస్ 24లు వివిధ సర్వే సంస్థలతో కలిసి ఫలితాలను వెల్లడించబోతున్నాయి. మరోవైపు మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం సాయంత్రం 7గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.