ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా

 

ఈత కొట్టడానికి వెళ్ళిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన హైదరాబాద్‌లోని గండిపేట చెరువులో జరిగింది. ఈతకు వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ యువకులు ఈ విషయంలో జాగ్రత్తగా వుండటం లేదు. ఫలితం.. తల్లిదండ్రులకు గర్భశోకంగా మిగులుతోంది. హైదరాబాద్ గండిపేట చెరువులోకి స్నానానికి వెళ్లిన హుమాయున్ నగర్‌కు చెందిన అబ్దుల్, సల్మాన్, సతీష్ అనే యువకులు నీళ్ళలోకి దిగిన వెంటనే మునిగిపోయి చనిపోయారు. గండిపేట చెరువులో రాళ్ళు బాగా ఎత్తు పల్లాలతో వుంటాయి. అడుగు తీసి అడుగు వేస్తే నీటి లోపలకి జారిపోయే విధంగా పరిస్థితి వుంటుంది. ఈ ముగ్గురు యువకులు మరణించడానికి కూడా ఇదే కారణమని స్థానికులు భావిస్తున్నారు.