పాఠశాలపై ఉగ్రదాడి...

 

పాకిస్థాన్ లో కూడా ఈ మధ్య ఉగ్రదాడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోదాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ బహవాల్‌నగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలపై సోమవారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు విద్యార్దులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇద్దరు సాయుధులైన ఉగ్రవాదులు పాఠశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. వెంటనే పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో స్కూల్‌ సెక్యూరిటీ గార్డు మాత్రం ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాలలోని విద్యార్థులు అందరూ సురక్షితంగా ఉన్నారని, వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు.