టీఆర్ఎస్ వేధిస్తోంది.. ఆ వార్తలు నిజం కాదు
posted on Oct 22, 2017 5:04PM
తన ఇంట్లో గంజాయి పెట్టించి కేసులో ఇరికేంచేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. శ్రీధర్ బాబుకు ఆయన అనుచరులకు మధ్య జరిగిన టెలీఫోన్ సంబాషణలు మీడియా చేతికి చిక్కడం.. ఉదయం నుంచి వరుస కథనాలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై శ్రీధర్ బాబు స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కాంగ్రెస్ నేతలను.. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ టార్గెట్ చేసి నిత్యం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తానని శ్రీధర్ బాబు చెప్పారు.