కేసీఆర్‌ని ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికే వుంది....

 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒక పార్టీ మీద మరోపార్టీ మాటల దాడి చేయడం సాధారణమైపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావును టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో చేరిన వారిని పవిత్రులు అనడం, బీజేపీలో చేరినవారిని పాపులు అనడం టీఆర్ఎస్ వారికి పరిపాటిగా మారిందని అన్నారు. తాజాగా జగ్గారెడ్డి బీజేపీలో చేరడం అదేదో ఘోరమైన విషయంలా టీఆర్ఎస్ నాయకులు చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ని ఎదుర్కునే సత్తా జగ్గారెడ్డికే వుందని కిషన్ రెడ్డి అన్నారు.