అవినీతి అంతమే టిడిపి లక్ష్యం

 

 

 

భారత దేశంలో అవినీతిని పూర్తిగా ప్రక్షాళణ చేయడమే టీడీపీ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ 33వ ఆవిర్భావ దినోత్సం వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయమని వ్యాఖ్యానించారు. దేశానికి పట్టిన అరిష్టం కాంగ్రెస్ అని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పతనం ఖాయమని చంద్రబాబు విమర్శించారు. సింగపూర్‌తో పోటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే అని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.