తెదేపా ఎంపీటీసీలు రాజీనామా...

 

నలుగురు టీడీపీ ఎంపీటీసీలు రాజీనామా చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలానికి చెందిన పల్లలమూడి ఎంపీటీసీ సంధ్యారాణి, ఎంఎన్‌ పాలెం ఎంపీటీసీ శాంతకుమారి, దిగవల్లి ఎంపీటీసీ నాగేంద్రప్రసాద్‌, రావిచర్ల ఎంపీటీసీ సాంబశివరావు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇంఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీటీసీల మధ్య వివాదం నడుస్తోంది.  గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా ఎంపీటీసీలకు తెలియకపోవడం.. అధికారులను ప్రశ్నిస్తే నియోజకవర్గ ఇంఛార్జి ఏర్పాటుచేశారని చెప్పడంతో వారు మనస్తాపానికి గురవుతున్నారు. దీంతో వారు నూజివీడు ఎండీవో కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామాలను ఎండీవో రాణికి అందజేశారు. అయితే వాటిని ఆమె తిరస్కరించి... ఇది తన పరిధిలోనిది కాదని జిల్లా పరిషత్‌ సీఈఓకు అందజేయాలని సూచించారు.