బాలయోగి ఆస్తుల్ని కాజేశా...కానీ అంటూ కేశినేని సంచలన ప్రకటన !


 

 

తెలుగు తమ్ముళ్ల మధ్య ట్వీట్ల యుద్ధానికి ఇప్పట్లో తెర పడేట్టు కనిపించడం లేదు. పేర్లు చెప్పకుండా తిట్టుకుంటున్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల వార్ ఇంకా నడుస్తూనే ఉంది. అయితే పార్టీ కోసం ఈ ట్వీట్స్ ఆపేస్తున్నానని ఈ వివాదానికి వెంకన్న పుల్‌స్టాప్ పెట్టగా నాని మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వెంకన్నను మళ్లీ టార్గెట్ చేశారు. ఆయన రెండు రోజుల క్రితం చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ మళ్లీ రచ్చ మొదలెట్టారు. 

దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు, ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా  నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా ? అంటే. అవును ‘నేను బాలయోగి ఆస్తులు కాజేశానని.. ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థమని నాని ట్వీట్ చేశారు. బాలయోగికి ఉన్న ఆస్తులు నీతి,నిజాయితీ విలువలు ,సిద్ధాంతాలు ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి వీటిని కాజేసి పాటిస్తున్నందుకు చాలా గర్వ పడుతున్నానని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ల్ వరదకు బాబు ఎలాంటి అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాలి మరి.