తెలుగుదేశం నాయకుడి కూతురు కిడ్నాప్

 

నల్గొండ జిల్లాలో రాజకీయాలు కిడ్నాప్‌ల వరకూ వెళ్ళాయి. నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బిల్యా నాయక్‌ కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారంటూ బిల్యా నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్యా నాయక్ రాజకీయ ప్రత్యర్థులే ఆయన కుమార్తెని కిడ్నాప్ చేసి వుంటారని స్థానికులు భావిస్తున్నారు.