నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: వైగో హెచ్చరిక

 

తమిళులకు భాషాభిమానం చాలా ఎక్కువ. తమిళ భాషను వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో, హిందీని అంతగా ద్వేషిస్తారు. హిందీని తమమీద రుద్దడాన్ని వారు ఎంతమాత్రం సహించరు. అయితే ఈమధ్య ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలలో హిందీని తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తమిళనాడులో పార్టీలకి అతీతంగా అందరిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షాత్తూ బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఎండీఎంకే నాయకుడు వైగో కేంద్ర ప్రభుత్వాన్ని హిందీ విషయంలో హెచ్చరించారు. నిద్రపోతున్న సింహాన్ని కదిలించాలని ప్రయత్నించవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరించారు. హిందీని తమపై రుద్దాలన్న నిర్ణయించడాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించదని, గతంలో కూడా రక్తాన్ని ధారపోసి తాము హిందీపై పోరాడామని, ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టద్దని ఆయన అన్నారు.