కోర్టుకు శ్వేతాబసు ప్రసాద్

 

వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన సినీ హీరోయిన్ శ్వతాబసు ప్రసాద్ను పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టుకు తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరంలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ శ్వేతాబసు ప్రసాద్ ఆదివారం పోలీసులకు పట్టుబడ్డారు. మీడియేటర్‌గా వ్యవహరించిన బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు సోమవారం ఉదయం ఎర్రమంజిల్ కోర్టులో హాజరు పరిచారు. కాగా నటి శ్వేతబసు ప్రసాద్ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు.