భయపెడుతున్న బలగాలు
posted on Jul 26, 2013 8:09PM
కేంద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో పోలీస్ శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది..ప్రదానంగా సీమాంద్ర ప్రాంతాల్లో మోహరిస్తున్న అదనపు బలగాలు సమాన్యులను భయపెడుతున్నాయి.. ప్రత్యేక తెలంగాణ నిర్ణయం జరిగిపోయిందని.. ప్రకటన వెలువడనుందన్న ఊహాగానాల నేపధ్యంలో పోలీస్ శాఖ ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటుంది.
అయితే పోలీస్ శాఖ మాత్రం కేవలం పంచాయితీ ఎన్నికల కోసమనే బలగాలను మోహరిస్తున్నామని చెపుతున్నా కేవలం సీమాంద్ర ప్రాంతంతో పాటు, హైదరాబాద్లోనే ఈ బలగాలను దించటం చర్చలకు తావిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం జరిగిపోయిందని సీమాంద్ర రాజధాని విషయంలోనే కోర్కమిటీ భేటి నిర్వహిస్తున్నారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది..
ఇలా నిమిష నిముషానికి మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలోనే పోలీస్ శాఖ అప్రమత్తం అవుతుంది.. సీమాంద్రలోని అన్ని జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి తో సమావేశం అయి పరిస్థితులపై చర్చించిన డిజిపి దినేష్ రెడ్డి ఎలాంటి పరిస్థితులనైనా ఎదర్కొనటానికి సిద్దం అవుతున్నారు.