స్మితా సబర్వాల్: కలిసొచ్చిన కన్నీరు
posted on Jun 6, 2014 3:29PM
మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్కి కన్నీరు కలిసొచ్చింది. మొన్నీమధ్య తెలంగాణ ఆవిర్భావం రోజున మెదక్ జిల్లాలో స్మితా సబర్వాల్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకార్యక్రమానికి హాజరైన ఒక అమరవీరుడి తల్లికి తన కొడుకు గుర్తొచ్చి భోరున విలపించారు. అది చూసిన సున్నిత మనస్కురాలైన స్మితా సబర్వాల్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ విషయం మీడియాలో వచ్చింది. అది చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్మితా సబర్వాల్ చాలా మంచి కలెక్టర్ అని ప్రశంసించారు. ఆ ప్రశంసలతో ఆగకుండా తన అదనపు కార్యదర్శిగా ప్రమోట్ కూడా చేసేశారు. ఆ విధంగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన స్మితా సబర్వాల్ శుక్రవారం కేసీఆర్ను కలిశారు. అనంతరం సీఎం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనా వ్యవహారాల్లో స్మితా సబర్వాల్ ప్రతిభావంతురాలన్న పేరు వుంది. అలాగే ఆమెకు రెండుసార్లు ఉత్తమ కలెక్టర్గా అవార్డులు కూడా వచ్చాయి.