భారత-ఏ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌

 

భారత్ -ఏ జట్టు కెప్టన్‌గా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించింది. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచుల కోసం జట్టును ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును సీనియర్‌ పురుషుల సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు సీనియర్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 

తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డికి ఈ జట్టులో స్థానం లభించింది. అతనితో పాటు సాయి సుదర్శన్‌, దేవదత్‌ పడిక్కల్‌, ప్రసిధ్‌ కృష్ణ, ఖలీల్‌ అహ్మద్‌ వంటి ప్రముఖ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వికెట్‌ కీపర్లుగా ధ్రువ్‌ జురెల్‌తో పాటు ఎన్‌. జగదీశన్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లకు లఖ్‌నవూ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫస్ట్ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 16 నుంచి 19 వరకు, రెండో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 23 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ మల్టీ-డే మ్యాచ్‌ల తర్వాత కాన్పూర్‌ వేదికగా సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 3, 5 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.

ఇండియా-ఏ జట్టు

శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిమన్యు ఈశ్వరన్‌, ఎన్‌. జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), సాయి సుదర్శన్‌, ధ్రువ్‌ జురెల్‌ (వైస్‌ కెప్టెన్‌ & వికెట్‌ కీపర్‌), దేవదత్‌ పడిక్కల్‌, హర్ష్‌ దూబే, ఆయుష్‌ బదోని, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తనుష్‌ కోటియన్‌, ప్రసిధ్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌, ఖలీల్‌ అహ్మద్‌, మానవ్‌ సుతార్‌, యశ్‌ ఠాకూర్‌.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu