హైదరాబాద్ లో దారుణం.. గుడిలోని దుర్గామాత విగ్రహం పెకలించివేసిన దుండగులు 

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి సఫ్దర్ నగర్‌లోని ఒక ఆలయ ధ్వంసం చేసిన క్రమంలో ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక కుక్కను చంపిన దుండగులు ఆలయ ఆవరణలోనే ఉరివేసి వేలాడదీశారు. అంతేకాకుండా దుర్గామత ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి ఆలయం బయట పడవేశారు. అంతేకాకుండా ఆలయానికి వెలుపల ఉన్న‌నాగ దేవత విగ్రహాలను కూడా దుండగులు‌ పగులగొట్టారు. దీంతో విషయం తెలిసిన వెంటనే భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మరోపక్క విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ కార్పొరేటర్ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితులని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.