శోభా నాగిరెడ్డి అంతిమయాత్ర ప్రారంభం

 

రోడ్డు ప్రమాదంలో మరణించిన వైసీపీ నేత భూమా శోభా నాగిరెడ్డి అంతిమయాత్ర ఆళ్ళగడ్డలోని ఆమె నివాసం నుంచి ప్రారంభమైంది. శోభా నాగిరెడ్డి ఇంటి దగ్గర వేలాదిమంది ఆళ్ళగడ్డ ప్రజలు వున్నారు. పూలతో అలంకరించిన లారీలో శోభా నాగిరెడ్డి మృతదేహాన్ని వుంచి ఆళ్ళగడ్డ ప్రధాన వీధుల్లోంచి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. తమ ప్రియమైన నాయకురాలిని చివరి చూపు చూసుకోవడానికి ఆళ్ళగడ్డ ప్రజలు వీధుల వెంట బారులు తీరారు. ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తవుతాయి.