డెబిట్‌ కార్డుల సర్వీస్ ఛార్జీలు ఎత్తివేత..

 

పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు వెసలుబాట్లు కల్పించింది. ఇప్పుడు తాజాగా మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ కొన్ని ప్రకటనలు చేశారు. అందులో ఆన్ లైన్ టికెట్లు, డెబిట్‌ కార్డుల సర్వీస్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ బుకింగ్‌కు డిసెంబర్‌ 31 వరకు సేవా రుసుము రద్దు చేసిందని.. ట్రాయ్‌ యూఎస్‌ఎస్‌డీ ఛార్జీలను రూ.1.50 నుంచి 50పైసలకు తగ్గించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా 1.5లక్షల తపాలా కార్యాలయాలు నగదు సరఫరా చేస్తున్నట్లు శక్తికాంత దాస్‌ ప్రకటించారు. సహకార బ్యాంకులకు నాబార్డు రూ.21వేల కోట్లు మంజూరు చేసిందన్నారు.