సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ కన్నుమూత..

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ (49)ఈ రోజు కన్నుముశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పలు టీవీ చానెళ్లలో పని చేసిన ఆయన తెలుగు కవిత్వంలో తన ప్రత్యేకమైన ముద్రను వేశారు. ఆయన మాగ్జిమమ్ రిస్క్, మేల్‌కొలుపు, మ్యూజిక్ డైస్ కవితా సంకలనాలను వెలువరించారు. కాగా అరుణ్ సాగర్ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

మరోవైపు అరుణ్ సాగర్ మృతికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ అరుణ్ సాగర్ మరణం చాలా బాధాకరం, తీరని లోటని అన్నారు. టీవీ ఛానెల్ ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివని బాలకృష్ణ అన్నారు