తెలంగాణలో వింత చోరీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు

 

బైక్ చోరీ, కారు చోరీ వంటి వార్తలు తరచూ చూస్తుంటే ఉంటాం. అయితే ఎప్పుడూ రొటీన్ గా ఇలా బైకులు, కార్లు ఏం దొంగతనం చేస్తాం అనుకున్నారో ఏమో కానీ.. కాస్త వెరైటీగా ఆలోచించి ఏకంగా ఆర్టీసీ బస్సునే దోచుకెళ్లారు దుండగులు. హైదరాబాద్‌లోని సీబీఎస్ బస్ స్టాప్‌లో ఈ నెల 23వ తేదీ రాత్రి ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సు నిలిపాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి ఆ బస్సు అక్కడి నుంచి మాయమైంది. ఎవరు ఎత్తుకెళ్లారు.. ఎక్కడికి తీసుకెళ్లారు అన్నది అంతుచిక్కలేదు. దీంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆ బస్సు తూప్రాన్ టోల్‌గేట్ దాటినట్టు సీసీటీవి ఫుటేజీ ద్వారా గుర్తించారు. బస్సు నాందేడ్ వైపుగా వెళ్తున్నట్టు చెప్పిన పోలీసులు.. అది కుషాయిగూడ డిపోకి చెందినదిగా తెలిపారు.