ఆర్టీసీ బస్సు దగ్ధం: డ్రైవర్ సజీవ దహనం

 

హైదరాబాద్‌లోని బోయినపల్లి సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-డీసీఎం లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం కాలిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పిల్లలు కూడా వున్నారు.