రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

 

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వద్ద శనివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం జంగిరెడ్డి గ్రామానికి చెందిన 11 మంది టాటా క్వాలిస్ వాహనంలో తిరుమలకు బయల్దేరారు. సీతారాంపేట దగ్గరకు వీరి వాహనం రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దాంతో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మృతులను వెంకటేశ్వర్లు, భార్గవి, కోటీశ్వరమ్మ, తిరుపాలు, నాగరాజ్, డ్రైవర్ ఖాజావలిగా గుర్తించారు. గాయపడినవారిలో భూదేశ్వరరావు, గోపాలకృష్ణ, శివసాయి, నరేంద్రలను గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి వుంది.