క్రిమినల్ కేసులపై కోర్టులో రేవంత్ పిటిషన్

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అధికారులపై నమ్మకం లేదో ఏమో? ఒకవేళ అయన అడిగిన దానికి అధికారులు నిజంగానే స్పందిచట్లేదో ఏమో? కావాల్సిన దానికోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు.న్యాయపరంగా పోరాడుతున్నారు.ఇటీవల భద్రత విషయంలో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి 4 + 4 భద్రత పొందిన సంగతి తెలిసిందే.తాజగా రేవంత్ రెడ్డి తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలపాలని మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచేందుకు ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. తనను టార్గెట్‌ చేసుకుని పోలీసులు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని రేవంత్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.కాగా రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.