జగన్ ను పరామర్శించిన మోహన్ బాబు

 

కోడికత్తి దాడి ఘటనలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు పరామర్శించారు.లోటస్‌పాండ్‌లో జగన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.వైఎస్‌ జగన్‌ వందేళ్లు ఆరోగ్యంగా బతుకుతారని అన్నారు.ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. జగన్‌ను పరామర్శించడానికి వచ్చానని.. రాజకీయాల ప్రస్తావనకు ఇది సమయం కాదన్నారు. సమయం వచ్చినపుడు తప్పకుండా మాట్లాడతానని మోహన్‌బాబు స్పష్టం చేశారు.