పార్లమెంట్‌కి వచ్చిన ప్రియాంక కొడుకు!

 

సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా కొడుకు రైహాన్ బుధవారం తన ప్రెండ్స్.తో కలసి పార్లమెంట్‌కు వచ్చాడు. సందర్శకుల గ్యాలరీలోంచి పార్లమెంట్ కార్యకలాపాలను గమనించాడు. స్పోర్ట్స్ జాకెట్ ధరించి వచ్చిన రైహాన్ సెంట్రల్ హాల్‌ను తిలకించిన అనంతరం సోనియాగాంధీ కార్యాలయంలో కాసేపు గడిపాడు. ఈ సందర్భంగా మాట్లాడిన రైహాన్ పార్లమెంట్ చాలా బాగుందన్నాడు. ప్రియాంక గాంధీ తన పిల్లలకి రాజకీయ పాఠాలు చెబుతున్నట్టున్నారు. మొన్నామధ్య లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాయబరేలి, అమేథీ నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారానికి వెళ్ళినప్పుడు తన కొడుకు రైహాన్, కూతురు మిరాయాలను కూడా వెంట తీసుకెళ్ళారు.