ఐసిస్ ఉగ్రవాదుల చెర నుండి తప్పించుకొన్న ప్రవాష్ రంజన్

 

మూడు-నాలుగు రోజుల క్రితం లిబియాలో ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుకు కిడ్నాప్ చేసిన ఇద్దరు భారతీయులలో ఒడిశాకు చెందిన ప్రవాష్ రంజన్ వారి చెర నుండి తప్పించుకొన్నాడు. ఉగ్రవాదుల చెరలో బందీగా ఉన్న మరో తెలుగు వ్యక్తి కొసనం రామ్మూర్తి క్షేమంగానే ఉన్నట్లు అతను మీడియాకి తెలియజేసాడు. కానీ జూలై 30న కిడ్నాప్ అయిన గోపీ కృష్ణ, బలరామ్ నేటికీ ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులు కూడా వారి క్షేమ సమాచారాల గురించి ఇంతవరకు ఎటువంటి సమాచారం చెప్పలేకపోతున్నారు.