ట్రిపుల్ తలాఖ్ పై మోడీ.. రాజకీయం చేయోద్దు...
posted on Oct 24, 2016 4:18PM
ట్రిపుల్ తలాఖ్ విధానంపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన మోడీ ట్రిపుల్ తలాఖ్ ను రాజకీయం చేయోద్దని కోరారు. యూపీలోని మహోబాలో జరిగిన బుందేల్ఖండ్ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. మహిళలకూ సమాన హక్కులను ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుందామని.. టీవీ చర్చల్లో పాల్గొనే వ్యక్తులు ట్రిపుల్ తలాఖ్ను హిందూ, ముస్లిం మధ్య అంశంగా చేయొద్దని మోదీ కోరారు. ఇది అభివృద్ధికి సంబంధించిన అంశమని.. కొంతమంది కేవలం ఓట్ల కోసం ముస్లిం మహిళలకు ఉండాల్సిన హక్కులను కాలరాస్తున్నారని మోదీ విమర్శించారు. ఓ వ్యక్తి ఫోన్లో మూడుసార్లు తలాఖ్ అని అంటే ఓ ముస్లిం మహిళ జీవితం నాశనమైపోవాల్సిందేనా.. ఇది సబబేనా అని ప్రశ్నించారు.