తైవాన్ విమాన ప్రమాదం: మృతులు ఎందరు?

 

తైవాన్‌లో ఓ విమాన ప్రమాదం జరిగింది. తైవాన్‌లోని పెంఘు రాష్ట్రంలో ట్రాన్స్ ఆసియా ఎయిర్ వేస్ విమానం కుప్పకూలింది. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్ ఎయిర్లైన్ సంస్థ ట్రాన్సేషియా ఎయిర్వేస్కు చెందిన ఈ విమానాన్ని మాగాంగ్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది విఫలం కావడంతో విమానం కూలిందని తెలుస్తోంది. అయితే ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది మరణించాలరన్న దాని మీద రకరకాల అంకెలు బయటకి వచ్చాయి. మొదట విమానంలోని అందరూ చనిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మృతుల సంఖ్య 51గా అధికారులు ప్రకటించారు. కొద్ది సేపటి తర్వాత దానిని 50 చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 47గా వుంది. ఇలా మృతుల సంఖ్య తగ్గుతూ వుండటం ఏమిటో అర్థం కాక విమానంలో వున్న వారి బంధువులు అయోమయానికి గురవుతున్నారు.