ఎన్నికలకు సమాయత్తం కండి ... బోత్స

 

ముందస్తు ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై పిసిసి అధ్యక్షుడు బోత్స సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్ లో సమావేశం జరిగింది. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణ రెడ్ది, పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిసిసి బోత్స జిల్లా కార్యవర్గాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా పంచాయితీలు, తరువాత పురపాలక, జిల్లా పరిషత్, మండల, వచ్చే సంవత్సరంలో సాధారణ ఎన్నికలు అందుకు పార్టీ యంత్రాంగాన్ని,  జిల్లా, నగర, పట్టాన పార్టీ శ్రేణులను, సమన్వయకర్తలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. జైపూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 15వ తేదీకల్లా క్షేత్రస్థాయిలో కమిటీలను వేయాల్సి ఉంటుందని, అందరూ దీనికి సహకరించాలని బోత్స కోరారు. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెంచామని కన్నా లక్ష్మీ నారాయణ ఈ సందర్భంగా తెలియజేసినప్పుడు పార్టీ శ్రేణుల్లో విభిన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయని తెలిసింది.