టీటీడీ అధీనంలోకి ఒంటిమిట్ట రామాలయం

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కడపజిల్లాలోని ప్రసిద్ధ ఒంటిమిట్ట దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు ఎప్పుడూ శ్రీరామ నవమి ఉత్సవాలు భద్రాచలంలో జరిగేవి. అయితే రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లింది. అందువల్ల లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామ నవమి ఉత్సవాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటిమిట్ట రామాలయం టీటీడీ ఆధ్వర్యంలోకి వెళ్లడం వల్ల ఇది గొప్ప పుణ్యక్షేత్రం గా తయారవుతుందని ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలు ఈ ఒంటిమిట్ట ఆలయంలోనే జరిగాయి. ఈ ఆలయం కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో ఉంది.