నెస్ వాడియా నా ముఖాన్ని సిగరెట్లతో కాల్చాడు: ప్రీతీ జింటా

 

తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను గతంలో ఎన్నోసార్లు శారీరకంగా హింసించాడని బాలీవుడ్ నటి ప్రీతీజింటా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నెస్ వాడియా అనేకసార్లు సిగరెట్లతో తన ముఖాన్ని కాల్చాడని ఆమె ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసు కమిషనర్‌కు రాసిన లేఖలో ప్రీతీ జింటా ఈ విషయాన్ని తెలిపింది. ‘‘కొన్నిసార్లు అతను భయంకరంగా ప్రవర్తించేవాడు. ఆ సమయంలో అతను నన్ను చంపేస్తాడేమోనని భయపడేదాన్ని. అతని ఆగడాలను భరించలేక ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అతనికి దూరమయ్యాను’’ అని ఆ లేఖలో ప్రీతీజింటా పేర్కొంది. అయిదేళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు భాగస్వాములుగా గతంలో వున్నారు. ఈమధ్యే ప్రీతీజింటా నెస్ వాడియా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీఎల్ సందర్భంగా నెస్ తనను దూషించి చేయి చేసుకున్నాడని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.